హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫీజును తగ్గించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు (ఏబీవీపీ) రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ డిమాండ్ చేశారు. బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఫీజుల పెంపుపై పునరాలోచించాలని కోరారు. నిరుద్యోగుల ఫీజులతో రాష్ట్ర ఖజానాను నింపుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వమంటే.. ఫీజుల పెంచడం, నిరుద్యోగులపై భారం మోపడమేనా..? ఫీజులను 150% నుంచి 300శాతానికి పెంచడమేనా. ? ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రాయితీనివ్వకపోవడమేనా.. ? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం టెట్ ఫీజును తగ్గించకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఝాన్సీ హెచ్చరించారు.