హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. అటవీ పునరుజ్జీవనం, అటవీ రక్షణ కార్యక్రమాలతో అడవులు కొత్త రూపును సంతరించుకొన్నాయి.
ఫలితంగా రాష్ట్ర అడవుల్లో జంతువైవిధ్యం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, జిన్నారం రిజర్వ్ ఫారెస్ట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వివిధ రకాల జంతువులు కనువిందు చేశాయి. పులులు, నీలివాలుగ, దుప్పులు, ఎలుగుబంటి, ముళ్లపందులు వంటి జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.