డోర్నకల్, జూలై 25 : మలి వయసులో తోడుగా ఉన్న భర్త అనారోగ్యంతో చనిపోగా, ఆ వృద్ధురాలు తట్టుకోలేక పోయింది. రాత్రి నుంచి గుండెలవిసేలా రోదిస్తూ.. గెండెపోటుతో మృతి చెందిన(Wife died) ఘటన మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్తి ముత్తయ్య(80) కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.
గురువారం ఉదయం అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు సిద్ధమవుతుండగా ముత్తయ్య భార్య యశోదమ్మ(70) మృతదేహం వద్ద రోదిస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మం దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వృద్ధ దంపతులకు అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు.