పాల్వంచ, ఆగస్టు 5: హెడ్ కానిస్టేబుల్ అయిన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య అతడికి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం చోటుచేసుకున్నది. పాల్వంచ (చాతకొండ) 6వ బెటాలియన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న గడ్డం రాజేశ్.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన స్వప్నను 2011లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప ఉన్నది. రెండేండ్ల నుంచి దంపతుల మధ్య విబేధాలు రావడంతో గొడవలు జరిగేవి. రాజేశ్ భార్యను ఇంటి నుంచి గెంటేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాజేశ్ వేరే మహిళతో బొల్లోరిగూడెంలో ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్వప్న మహిళా సంఘాలను ఆశ్రయించారు. గురువారం మహిళతో ఉన్న సమయంలో రాజేశ్ను పట్టుకొని భార్య దేహశుద్ధి చేసింది. పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.