Election Commission | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది. రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్కు ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులపై రేవంత్ వ్యాఖ్యలపై ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్ సీఎం రేవంత్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది.
రైతు భరోసా నిధుల విడుదలపై ఆంక్షలు విధించింది. ఇదిలా ఉండగా.. ఐదుఎకరాలు పైబడిన వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేస్తున్నట్లు పేర్కొంది. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే నిధులు విడుదలవగా.. తాజాగా ఐదెకరాలుపైబడిన వారికి చెల్లింపులు ప్రారంభించింది. ఇటీవల ఎన్నికల బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి మే 9వ తేదీలోగా రైతులందరికీ రైతుభరోసా నిధులు విడుదల చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.