హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రిపై .. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకురావడంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు విఫలం అయినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ వాగ్ధానం చేశారని, కానీ బీజేపీ నేతలు ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నారని విమర్శించారు. ఇతర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీలను కేటాయిస్తుంటే, మరెందుకు మన రాష్ట్రానికి ఆ నేతలు కోచ్ ఫ్యాక్టరీని తీసుకురాలేకపోతున్నట్లు ఆయన ప్రశ్నించారు.
Can any one of the BJP MPs/Union Minister from Telangana answer why the promised Kazipet Rail Coach factory is being denied while others are being considered?
I am happy for Assam but the spineless BJP leadership in #Telangana owes an explanation to the people of the state https://t.co/GnfLtjRKyH
— KTR (@KTRTRS) December 22, 2022
అస్సాం రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీని రైల్వే శాఖ కేటాయిస్తున్నట్లు తెలిసింది. అయితే అస్సాంకు కోచ్ ఫ్యాక్టరీని కేటాయించడం పట్ల సంతోషంగా ఉందన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ బీజేపీ నేతలు వెన్నుపూసలేని వారిగా తయారైనట్లు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీనిపై బీజేపీ నాయకులు వివరణ ఇవ్వాలని ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
భారతీయ రైల్వేశాఖ అస్సాంలోని కోక్రాజార్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఇండియన్ టెక్ అండ్ ఇన్ఫ్రా తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపింది. ఆ ట్వీట్ ఆధారంగా మంత్రి కేటీఆర్ .. తెలంగాణ బీజేపీ నేతలను నిలదీశారు.