హైదరాబాద్: పత్తికి కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఒకే విధంగా మద్దతు ధర చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. వన్ నేషన్.. వన్ ట్యాక్స్, ఒకే దేశం.. ఒకే ఎలక్షన్, ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డ్, వన్ నేషన్.. వన్ మార్కెట్ అంటూ ఊదరగొట్టే కేంద్రం వన్ నేషన్.. వన్ ఎంఎస్పీని ఎందుకు ఇవ్వడం లేదన్నారు. పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉందని నిలదీశారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతు పట్ల ఎందుకు వివక్ష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ పత్తికి క్వింటాకు రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణలో పండిస్తున్న పత్తికి రూ.7521 మాత్రమే చెల్లించడం దూర్మార్గమని చెప్పారు. గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా అని ఎక్స్ వేదిగా ప్రశ్నించారు.
‘‘One Nation, One Tax. One Nation, One Election. One Nation, One Ration Card. One Nation, One Market అంటూ ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం, One Nation, One MSP అని ఎందుకు ఇవ్వడం లేదు. పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉంది.
నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతు పట్ల ఎందుకీ వివక్ష గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు ₹8,257 చెల్లిస్తున్న కేంద్రం, తెలంగాణ పండిస్తున్న పత్తికి రూ.7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గం. గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా..? Why not One Nation One MSP ?’’ అంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు.
“One Nation, One Tax.”
“One Nation, One Election.”
“One Nation, One Ration Card”
“One Nation, One Market.”అంటూ ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం,
One Nation, One MSP అని ఎందుకు ఇవ్వడం లేదు.పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉంది.
నాణ్యమైన…
— Harish Rao Thanneeru (@BRSHarish) October 17, 2024