హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బంజారాహిల్స్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు 2004లో ప్రభు త్వం జరిపిన భూ కేటాయింపును రద్దు చేయాలని కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిం ది. దాదాపు 20 ఏండ్ల తర్వాత పిటిషన్ వేయ డం ఏమిటని నిలదీసింది. బీఆర్ఎస్కు భూమి కేటాయింపును రద్దు చేయాలని మాజీ ఎమ్మె ల్సీ రాములు నాయక్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమా ర్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
బీఆర్ఎస్ ఆఫీస్ కోసం కేటాయించిన భూమి లో నిర్మితమైన భవనంలో టీవీ చానల్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని, ఆ భూకేటాయింపును రద్దు చేయాలని పిటిషనర్ తరఫు న్యా యవాది చికుడు ప్రభాకర్ వాదించారు. దీని పై హైకోర్టు స్పందిస్తూ.. ఇరవై ఏండ్లుగా పిటిషన్ ఎందుకు వేయలేదో కారణాలు చెప్పాలని, తీవ్ర జాప్యం ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.