ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు మార్చిందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు, అధికారులు మాటలు మంచిగానే చెప్తున్నారని.. చేతల్లోకి వచ్చేసరికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
అన్నదాతలను మోసం చేయవద్దని, ఇది రాజకీయ పోరాటం కాదని, రైతుల కోసం చేస్తున్న దీక్ష అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను మోసం చేయవద్దని కోరారు.