Minister KTR | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్లో.. మిలియన్ మార్చ్ నేటికీ నా కండ్లలో మెదులుతూనే ఉన్నదని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి.. ‘తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం?
తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన MLA ఎవరో చెప్పుకోండి చూద్దాం?
తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు
మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని… https://t.co/7JzGrxnpgw
— KTR (@KTRBRS) March 11, 2023
తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోదీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కాదు. మోదీ వ్యాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే పనులు చెయ్యండి’ అని చురకలు అంటించారు. మరో ట్వీట్లో కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి తీరును ఎండగట్టారు. పిల్లలు పుట్టరన్న కారణంతోనే కొందరు పెండ్లి చేసుకోవటం లేదని, పెండ్లి చేసుకొన్నా భార్యతో ఉండరని నళిన్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగాన్ని ట్విట్టర్లో రెడ్ కో చైర్మన్ సతీశ్రెడ్డి పోస్ట్ చేయగా.. ఆ వ్యాఖ్యలు అసభ్యంగా, అభ్యంతరకరంగా, చెత్తగా ఉన్నాయని కేటీఆర్ స్పందించారు. ఇలాంటివారే బీజేపీని నడిపించడానికి సరైన వ్యక్తి అని దెప్పిపొడిచారు.