మందమర్రి, నవంబర్ 12 : నీట్లో ర్యాంకు లు సాధించి ఎంబీబీఎస్ సీట్లు పొందిన ఎనిమిది మంది విద్యార్థులకు విప్ బాల్క సుమన్ ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. శనివారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లోని తన నివాసంలో రామకృష్ణాపూర్కు చెందిన మహ్మద్ సన, అంజుమ్, బొంకూరి జోషిత, కోటపల్లి మండలానికి చెందిన దీపక్, గిర్నాల శ్రీవర్ష, కొపిశెట్టి సాధ న, ఎసుకూరి పూజితలకు రూ. 50 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించి పేదలకు సేవలందించడంతోపాటు ఈ ప్రాంతానికి మంచి పేరును తీసుకు రావాలని సూచించారు.