KTR | కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ బాధ్యత తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తుందని పేర్కొంది. రేవంత్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ భస్మమే అని ఆరోపించింది.
లోక్సభ ఎన్నికల సమయంలో మహబూబ్నగర్, మల్కాజిగిరి బాధ్యత తీసుకుంటే.. ఆయా స్థానాల్లో బీజేపీ గెలిచిందని గుర్తుచేసింది. హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యత తీసుకుంటే అక్కడ కూడా బీజేపీనే గెలిచిందని పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్గా వెళ్తే అక్కడ కూడా బీజేపీనే గెలిచిందని తెలిపింది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎప్పుడూ లేనివిధంగా ముఖ్యమంత్రి హోదాలో క్యాంపెయిన్ చేశారని తెలిపింది. కానీ అనూహ్యంగా అక్కడ కూడా బీజేపీ అభ్యర్థినే విజయం సాధించారని.. ఇందులో మర్మం ఏమిటో అని సందేహం వ్యక్తం చేసింది. ఈ మర్మం “భడే భాయ్ – ఈ చోటే భాయ్” కే తెలియాలని అన్నది.