Krishank | ఎమ్మెల్సీ కవిత మీద ఈడీ సోదాలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. ఎక్కడ అయితే ఎన్నికలు ఉంటాయో.. అక్కడికి మోదీ కంటే ముందు ఈడీ వెళ్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వారాల ముందు కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపించిందని.. ఇప్పుడు మళ్లీ లోక్సభ షెడ్యూల్ విడుదలకు కొద్ది గంటల ముందు ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో బీజేపీ ఓటీటీ వెబ్సిరీస్లను నడిపిస్తోందని.. ఎలాంటి భయాలు లేకుండా ఈ వేధింపులను ఎదుర్కొంటామని తెలిపారు.
మోదీ రాకముందు ఈడీ వస్తుందని ఆయన అన్నారు. అనేక రాష్ట్రాల్లో చాలామంది నాయకులు ఇదే విషయాన్ని చెప్పారని క్రిశాంక్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదేరకంగా జరుగుతుందని ఆయన అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే స్టంట్ చేశారని.. ఇవాళ కూడా అదే స్టంట్ జరుగుతుందని విమర్శించారు. లిక్కరో.. డిక్కరో.. కిక్కరో దీని మీద తీర్పు ఇచ్చేది సుప్రీంకోర్టు అని.. కానీ దానికంటే ముందే భారతీయ జస్టిస్ పార్టీ వాళ్లే తీర్పు ఇచ్చినట్టు దాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్పై దీని మీదనే పోరాటం చేయగలుగుతామని అనుకుంటే దీన్ని ఎవరూ నమ్మేటట్టు లేరని స్పష్టం చేశారు. ఇది క్లియర్గా రాజకీయ వేధింపులే అని అర్థమవుతున్నాయని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ, ఐటీ ఎంతమందిని పంపించినా.. వాళ్లను రాజకీయంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కోర్టు పరంగా కూడా ఎదుర్కొంటామని చెప్పారు.
When there is Election,
ED comes before Modi❗ED gave notice to @RaoKavitha in Sept 2023 weeks before Telangana Assembly notification,
Now ED,IT Raid just hours before LokSabha scheduleBJP is running OTT WebSeries with ED,IT,CBI & we will face their harassment without Fear✊🏽 pic.twitter.com/uz1h6Afrcz
— Krishank (@Krishank_BRS) March 15, 2024
—