Medigadda Barrage | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ జలాశయంలో పిల్లర్ కుంగుబాటు, భద్రతా వైఫల్యాలపై సీబీఐ, కేంద్ర ఎన్నికల సంఘాలు ఏం చేస్తాయని హైకోర్టు పిటిషనర్ను నిలదీసింది. ప్రాజెక్టు భద్రత వ్యవహారాలకు సీబీఐకి ఏం సంబంధమని ప్రశ్నించింది. సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాల్సిందిపోయి రాష్ట్రపతి, ఎన్నికల సంఘం, జాతీయ విపత్తుల నిర్వహణ మండలి, సీబీఐ వంటి సం స్థలకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీసింది.
మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుకు బాధ్యులెవరో తేల్చే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు జీ నిరంజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం అసలు పిటిషనర్ ఉద్దేశం ఏమిటో చెప్పాలని కోరింది. పిటిషన్కు విచారణార్హతపై ప్రభుత్వ వాదన తెలు పాలని అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్రెడ్డిని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.