హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి(MLA Sunitha Laxmareddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మెదక్ లోక్సభ బీఆర్ఎస్ (BRS) సన్నాహక సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. డిసెంబర్ 9నే రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ(Loan waiver) అమలు సంగతి ఏమైందని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు(Six Gurantees), ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేస్తామని వాటి ఉసేత్తడంలేదన్నారు. రైతు భరోసాకు ఎకరానికి రూ.15వేలు ఇస్తామన్నారు వాటి గురించి మాట్లాడడం లేదని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఉన్న దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, ఎమ్మెల్యేల హక్కులకు గౌరవం ఇవ్వడంలేదని ఆరోపించారు.
మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అడ్డా..
మెదక్ లోక్సభ (Medak Loksabha) స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంటుదని సునితా లక్ష్మారెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. వరుసగా ఇప్పటికే మూడు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని అన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారని ఆమె గుర్తు చేశారు. సమావేశానికి హాజరైన కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harish rao) పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.