DGP Anjani Kumar | సీపీఐ మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సందీప్ దీపక్రావును పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన అరెస్ట్ మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తెలిపారు. దీపకర్రావు పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారని, ఆయన పలువురు అగ్రనేతలతో దీపక్రావు సమావేశాలు జరిపారని పేర్కొన్నారు.
కర్ణాటక, తమిళనాడు, కేరళ ట్రైజంక్షన్ ఏరియాలో దీపక్రావు కీలకంగా ఉన్నారన్నారు. ఈ ఏడాది దీపక్రావు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, రెండు మూడు రోజుల కిందట దీపక్రావు హైదరాబాద్కు వచ్చారని చెప్పారు. కచ్చితమైన సమాచారం మేరకు దీపక్రావును అరెస్టు చేసినట్లు వివరించారు. ఆయన కోసం మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారని, అలాగే ఎన్ఐఏ బృందాలు సైతం వెతుకుతున్నాయన్నారు. మహారాష్ట్ర దీపక్రావుపై రూ.25లక్షల రివార్డ్ను ప్రకటించిందని వివరించారు. తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు లేవని తెలిపారు.
దీపక్రావు మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్నారని, ఆమెపై సైతం నిఘా పెట్టినట్లు వివరించారు. ఇదిలా ఉండగా కేరళ దీపక్రావును అనిల్, వికాస్ పేర్లతో పిలుస్తుంటారు. మహారాష్ట్ర థానే జిల్లా అంబర్నాథ్కు చెందిన దీపక్రావు గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడు. ధూలే, బెంగళూరులోనూ అరెస్టయి జైలుకు వెళ్లివచ్చాడు. చాలాకాలం మహారాష్ట్రలో పనిచేసిన ఆయన 2019లో పాలక్కడ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత మణివాసగం మృతి తర్వాత 2020 నుంచి పశ్చిమ ఘాట్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.