హైదరాబాద్ : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు.
కొవిడ్ కారణంగా వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం అమీర్పేటలోని దుర్గామాత ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
సీఎం కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.
పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి కొప్పులకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బీ వినోద్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు కే విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, హరిప్రియా నాయక్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి