కొడకండ్ల, మార్చి 12: కల్లుగీత వృత్తిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు.