హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల లోపే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, వారి ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందేలా చూడాలని స్పష్టంచేశారు. తద్వారా పార్లమెంట్ ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్లమెంట్ ఎన్నికలపై ఎంసీహెచ్చార్డీలో సమీక్ష నిర్వహించారు.
ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పార్లమెంట్ స్థానాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులతో సీఎం చర్చించారు. కనీసం 12 ఎంపీ స్థానాలకు తగ్గకుం డా గెలిపించుకోవ డం లక్ష్యంగా పెట్టుకోవాలని దిశానిర్దే శం చేశారు. సోమవారం ఐదు ఉమ్మ డి జిల్లాల పరిధిలో ని పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష జరిపిన సీఎం, రెండోరోజు మిగతా ఐదు జిల్లాల పరిధిలోని ఎంపీ స్థానాలపై చర్చించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ విజయవకాశాలపై ఆరా తీశారు. ప్రతి అసెం బ్లీ నియోజకవర్గానికి అభివృద్ధి పనుల కోసం రూ.10 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయిస్తున్నామని చెప్పారు. ఇన్చార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలకు సూచించారు.
బదిలీల్లో పైరవీలకు తావు లేదు
అధికారులు, పోలీసుల బదిలీల్లో ఎమ్మెల్యేలు, నాయకులు జోక్యం చేసుకోవద్దని రేవంత్రెడ్డి సూచించారు. బదిలీల్లో పైరవీలకు తావు లేదని పేర్కొన్నారు.