ఘట్కేసర్,ఫిబ్రవరి1 : ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం 81 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తూ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ప్రథమంగా నిలుపడానికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాలు నిరుపేద కుటుంబాలక వరంగా మారాయన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, ఘట్కేసర్, పోచారం మున్సిపల్ చైర్మన్లు ఎం.పావని, బి.కొండల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.