Weather Report | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్లో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాల్లకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.
11న ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు, 12న ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 13న, 14 తేదీల్లో కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు, 15న కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, కరీంనగర్, వరంగల్, మహూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, మహూబాబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ జిల్లాలకు అలెర్ట్ను జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. మంగళవారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. దన్సూరాబాద్ (నిర్మల్) 42.8, కొల్లాపూర్ (నాగర్ కర్నూల్) 42.7, కట్టంగూర్ (నల్గొండ) 42.6, ఆదిలాబాద్ అర్బన్లో 42.6, నేలకొండపల్లె (ఖమ్మం) 42.5, లక్కవరం రోడ్ (సూర్యాపేట) 42.4, అలమ్పూర్ (జోగులాంబ) 42.4, వడ్డెమాన్ (మహబూబ్నగర్) 42.2, మల్లాపూర్ (జగిత్యాల) 42.2, తలమడుగులో 42.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ఇబ్బందులుపడుతున్నారు. ఎండల నేపథ్యంలో ప్రజలంతా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని అధికారులు చెప్పారు. ఎండదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.