హైదరాబాద్, ఫిబ్రవరి 29 (హైదరాబాద్): తెలుగు రాష్ర్టాల్లో ఎండల తీవ్రత పెరుగుతున్నదని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఉభయ రాష్ర్టాల్లో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రివేళ ఈ ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నది. ఇటు తెలంగాణలో ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగి, 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని పేర్కొన్నది. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయని తెలిపింది.