నందిపేట్, సెప్టెంబర్ 29: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వన్నెల్(కే) గ్రామ ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. 60 కుటుంబాల పెద్దలు శుక్రవారం సమావేశమై తాము బీఆర్ఎస్ పార్టీకి, ఆర్మూర్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తీర్మానించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో జీవన్రెడ్డిని గెలిపించుకుంటామని ప్రటించారు. అనంతరం తీర్మాన పత్రాన్ని ఎంపీపీ వాకిడి సంతోష్రెడ్డికి అందజేశారు.