బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 16: బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పోచారం శ్రీనివాస రెడ్డిని తిరిగి గెలిపించుకుంటామని బాన్సువాడ పట్టణ పరిధిలోని కొయ్యగుట్ట ప్రాంతంలోని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీవాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మాన ప్రతిని శనివారం స్పీకర్ పోచారానికి అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. బాన్సువాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికే తాము అండగా ఉంటామని ప్రకటించారు.
మంత్రి వేములకు వివిధ సంఘాల మద్దతు
మోర్తాడ్/భీమ్గల్, సెప్టెంబర్ 16: వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి పోటీచేయనున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి పలు కులసంఘాల మద్దతు లభిస్తున్నది. మోర్తాడ్ మండలంలోని ధర్మోరాలోని నాయకపోడ్ రెండు సంఘాలు, మున్నూరుకాపు, గురడి కాపు, పద్మశాలీ, మాసిట్ల సంఘాలు, భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గంగపుత్ర సంఘం సభ్యులు 40 మంది ఏకగ్రీవ తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటు వేస్తామని చేసిన తీర్మాన ప్రతులను స్థానిక ప్రజాప్రతినిధులకు శనివారం అందజేశారు.