హైదరాబాద్ : విజయ డెయిరీని దేశంలోనే నెంబన్ వన్ స్థానానికి తీసుకెళ్తామని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ పార్క్, లుంబినీ పార్క్ల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్ క్రీమ్ పార్లర్లను ప్రారంభించి మాట్లాడారు.
నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. రూ.750 కోట్ల టర్నోవర్తో దూసుకెళ్తుందన్నారు. గతంలో విజయ డెయిరీ ఉత్పత్తులు అందరికి అందుబాటులోకి తీసుక రాలేదు. ఇప్పుడు 1000 అవుట్ లెట్స్ ఎర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు.
వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న పాల ఉత్పత్తి దారులతో సమావేశం ఎర్పాటు చేశాం. పాల సేకరణ ధరను లీటర్కు 5 రూపాయలు పెంచామని గుర్తు చేశారు. అన్ని పాల ఉత్పత్తులు విజయ డెయిరీలో దొరుకుతాయన్నారు.
మార్కెట్తో పోటీపడి డెయిరీ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, తదితరులు ఉన్నారు.