హనుమకొండ : హనుమకొండలో ఎంసీఏ చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వెంట పడుతూ ఓ యువకుడు గొంతు కోసిన సంఘటనపై పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని మంత్రి పోలీసులను ఆదేశించారు. అలాగే యువతి ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం వైద్యులు, సూపరింటెండెంట్తో మాట్లాడారు. యువతికి మంచి వైద్యం అందించాలన్నారు.