నల్లగొండ : నల్లగొండలోని పానగల్ వద్ద.. మార్నింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించిన ఓర్సు విష్ణు మూర్తి, స్వప్న దంపతుల పార్థీవదేహాలకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(MLA Kancharla) నివాళులర్పించారు. ఎన్జీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పని చేస్తున్న విష్ణుమూర్తి, అతని భార్య స్వప్న రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరం అన్నారు.
దీంతో వారి పిల్లలు అనాథలయ్యారని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. వారి పిల్లల పేరు మీద రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని, ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు, పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, సూర మహేష్, తదితరులు వెంట ఉన్నారు.