సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన బాధిత కుటుంబాలకు మంత్రి ఇన్సూరెన్స్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త ఇంటికి సీఎం కేసీఆర్ పెద్ద దిక్కులా ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. పార్టీకి కార్యకర్తలే పునాది అన్నారు. కార్యకర్తల కోసం టీఆర్ఎస్ పార్టీ 18 కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్గా చెల్లిస్తుందన్నారు.
కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించడం ద్వారా వాళ్ల ఇంటికి పెద్ద దిక్కులా కేసీఆర్ నిలుస్తుండన్నారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.