వేములవాడ : ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని(Farmers) ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు(Mla Ramesh Babu) అన్నారు. నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం గోవిందారం, పసునూర్, దేశాయిపేట్, మన్నెగూడెం, కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్, తాండ్రియాల గ్రామాల్లో వడ గండ్ల వాన, గాలి దుమారంతో నష్ట పోయిన పంటలను, కల్లాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ శ్రేయస్సు కోరే ప్రభుత్వమని పేర్కొన్నారు. ఒకప్పుడు వ్యవసాయం(Agriculture) దండుగ అనే స్థితి నుంచి పండుగ చేసిన ఘనత ప్రభుత్వానిదని వెల్లడించారు. సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు, రైతుబీమా(Raitu Beema), వడ్ల కొనుగోలు, సకాలంలో ఎరువుల సరఫరాను సకాలంలో అందిస్తూ అండగా నిలుస్తుందని తెలిపారు. అకాల వర్షం రైతును తీవ్రంగా నష్టాలపాలు చేసిందని అన్నారు.
రైతులు అధైర్య పడవద్దని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. మన్నేగూడెం గ్రామంలో పాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు , మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి , ఎంపీపీలు దోనకంటి ఉమ దేవి , జవ్వాజి రేవతి , మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉదిగిరి రమ్య , గుండారపు సౌజన్య , డైరెక్టర్లు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.