హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎంప్లాయ్మెంట్ ఐడీ రాకముం దు వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యను వారంలో పరిష్కరిస్తామని రెవెన్యూశాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చినట్టు ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి తెలిపా రు. బుధవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా నాయకులు కలిశారు.
రిజిస్ట్రేషన్ శాఖ రాబడి పెంచండి
రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు త్వరలో శాశ్వత భవనాలు నిర్మిస్తామని చెప్పారు.