కరీంనగర్ : కరీంనగర్ నడిబొడ్డున ఉన్న మల్టీపర్సస్ స్కూల్ మైదానంలో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనుల్లో భాగంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కరీంనగర్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ పార్కు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
స్మార్ట్ సిటీ నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. కొవిడ్ కారణంగా స్మార్ట్సిటీ బోర్డుమీటింగ్ జరగకపోవడంతో అనేక అభివృద్ధి పనులు పెండింగ్లో పడిపోయాయన్నారు. ఈ వారంలో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు వానలు