హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): న్యాక్కు సంబంధించిన భూములను పొందిన కొన్ని సంస్థలు పూర్తిగా కమర్షియల్ కార్యకలాపాలకు వినియోగిస్తూ సంస్థ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నాయని, అలాంటి వాటిని సరి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం న్యాక్లో జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో సీఎస్ శాంతికుమారితో కలిసి మం త్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కన్స్ట్రక్షన్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసి, శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. కన్స్ట్రక్షన్ వర్సిటీ, జిల్లాల్లో స్కిల్ సెంటర్ల ఏర్పాటు, న్యాక్ భూముల రక్షణ, నిరుద్యోగుల ఉపాధి కల్పనపై విస్తృతంగా చర్చించారు.