హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగా ణ): భారత రక్షణ రంగానికి పూర్తిస్థాయిలో ఊతమిచ్చి, డిఫెన్స్ ఎక్స్పోర్టర్గా దేశాన్ని ని లిపేందుకు అహర్నిశలూ కృషి చేస్తామని డి ఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేష న్ (డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామ త్ తెలిపారు. హైదరాబాద్లోని రిసెర్చ్ సెం టర్ ఇమారత్లో (ఆర్సీఐ) ఆదివారం డీఆర్డీవో ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆయా దేశాల రక్షణకు ఆయుధాలను ఇక్కడి నుంచే ఎగుమతి చేసే స్థాయికి ఇండియాను తీసుకెళ్లడానికి డీఆర్డీవో పెద్దన్న పాత్రను పోషిస్తుందని హామీ ఇచ్చారు. టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ను వినియోగించి కొత్త ఆవిష్కరణలు పరిచయం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రక్షణ రంగ నిపుణులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీహెచ్ వీఎస్ నారాయణమూర్తి, డాక్టర్ చంద్రికా కౌశిక్, రంజిత్ సింగ్, డీఆర్డీవో డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, 180కి పైగా పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.