హైదరాబాద్ : రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకొనే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఒమిక్రాన్ కట్టడికి హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇంకా హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ అందలేదు. అందిన తరువాత సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఓమిక్రాన్ విషయంలో ఎయిర్పోర్ట్లో అందరికి టెస్టులు చేస్తున్నాం. టెస్టుల సంఖ్య పెంచమని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి గుర్తు చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్కి కేంద్రం బూస్టర్ వ్యాక్సిన్ వేసే విషయంలో కేంద్రం స్పందించడం లేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రనికి తెలిపినా..
కేంద్రం బూస్టర్ డోస్, చిన్న పిల్లల వ్యాక్సినేషన్ పై స్పందించడం లేదని మంత్రి తెలిపారు. ఇతర దేశాలు బూస్టర్ ఇవ్వాలని చెబుతున్నా కేంద్రం నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల చివరిలో ఢిల్లీ లో ఆర్థిక శాఖ మంత్రులతో కేంద్రం నిర్వహించనున్న సమావేశానికి వెళ్లే అవకాశం ఉందన్నారు.
అక్కడ మరో మారు కేంద్రంతో వ్యాక్సినేషన్, కొవిడ్ కట్టడి పైన కేంద్రంతో మాట్లాడుతామని మంత్రి స్పష్టం చేశారు.