మహబూబాబాద్ : మావోయిస్టు పార్టీ అగ్రనేత దివంగత హరి భూషణ్ భార్య శారద లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. గంగారం మండలం మడగూడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన మావోయిస్టు నేత హరి భూషణ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పోలీస్ శాఖ మావోయిస్టుల ప్రాణాలు నిలిపే ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు.
హరిభూషణ్ భార్య అనారోగ్యంతో పోరాడుతూ ఉన్న తరుణంలో పోలీస్ శాఖ వైద్య సహాయం తీసుకోవాలని ఎస్పీ కోరారు. పాత సిద్ధాంతాలు నమ్మి ఆలస్యం చేయడం వల్ల ప్రాణాలకు ముప్పు వస్తుందన్నారు. కారోనాతో బాధపడుతున్నవారు ఎవరైనా కూడా పోలీస్ వారి సహాయం తీసుకొని ప్రాణాలు నిలుపుకోవలని ఎస్పీ సూచించారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి