మహబూబాబాద్ : టీఆర్ఎస్లో పనిచేస్తున్న ప్రతికార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. గురువారం గూడూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, చంద్రుగూడెం కాంగ్రెస్కు చెందిన మండల నాయకులతో పాటు మరో వంద మంది దళిత కుటుంబాలు టీఆర్ఎస్లో చేరారు.ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త, పాత తేడా లేకుండా అందర్నీ గుండెల్లో నిలుపుకుని సముచిత స్థానం కలిపిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని వివరించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీలం సతీశ్, పోలేపక వెంకట్రాం నర్సయ్య, కత్తి అశోక్, గడ్డం నర్సయ్య తదితరులు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.