KTR | ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచినవారిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని.. పార్టీ గౌరవప్రదమైన స్థానాలను సాధించిందన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడారు. ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, బీఆర్ఎస్కు గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు.
ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని చెప్పారు. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి నాయకత్వంపై సానుకూలత స్పందన వస్తుందన్నారు. త్వరలో విస్తృత స్థాయి సమావేశం ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో త్వరలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. సమావేశంలో అన్ని విషయాలు కూలంకశంగా చర్చింది కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతిభవన్ కేంద్రంగా విధులు నిర్వహించిన తామంతా ఇకపైన తెలంగాణభవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు.
సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీలు రంజిత్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్ తదితర ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు, పోటీచేసిన నాయకులు పలువురు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న వారంతా తమతమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకొని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా లేఖలను పంపారు.