భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్తో ముంపునకు గురయ్యే గ్రామాలపై సర్వే శాస్త్రీయంగా ఉండాలని, అడ్డగోలుగా సర్వే చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హెచ్చరించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.
పోలవరం అథారిటీ బృందం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఈ నెల 3,4వ తేదీల్లో పర్యటించనున్న నేపథ్యంలో బ్యాక్వాటర్ వల్ల ముంపునకు గురయ్యే గ్రామాల లెక్క కచ్చితంగా ఉండాలని సూచించారు. ‘కాకి లెక్కలు వేసి.. ముంపు లేదు.. అంత వాటర్ రా దు’ అని అడ్డుగోలు సర్వేలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ముంపు ప్రాంత ప్రజల పక్షాన ఉంటామన్నారు.