ధర్మారం, ఏప్రిల్ 13: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడి యా ప్రధాన కార్యదర్శి సల్వాజీ మాధరావుపై కాంగ్రెస్ నాయకులు పెట్టిన అట్రాసిటీ కేసును ఎత్తివేయకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇంటి ఎదుటే చచ్చిపోతామని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశా రు. రెండ్రోజుల కింద మాధరావును అట్రాసిటీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో శనివారం మాధవరావు తల్లిదండ్రులు సల్వాజీ మారుతీరావు, రాజవ్వ, అతని సోదరి మాధవి ధర్మారంలో మీడియాతో మాట్లాడారు.
మాధవరావు అధికార పార్టీని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు కక్షగట్టి గత నెలలో తీవ్రంగా దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పు డు లేని విషయాన్ని సృష్టించి, కాంగ్రెస్ యూ త్ నాయకుడిని ఎస్సీ కులం పేరిట దూషించాడని అక్రమంగా కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించారని, ఇది ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పనేనని పేర్కొన్నారు. తమ కొడుకు పై కేసును ఎత్తివేసి జైలు నుంచి విడుదల చేయించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మాధవరావు తల్లిదండ్రులను బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పు ల ఈశ్వర్ పరామర్శించారు. పార్టీపరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. మాధవరావుపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై ఎందుకు కేసు నమో దు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.