కరీంనగర్ : కేంద్రం బీఆర్ఎస్ నాయకులపై పెడుతున్న కుట్రపూరిత కేసులు ధైర్యంగా ఎదుర్కొంటామని, వెనక్కి తగ్గేదే లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు(Planning Board Vice Chairman) వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్(Karimnagar ) జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉద్యోగులు చేసిన తప్పుకు ప్రభుత్వం, మంత్రులపై లేనిపోని ఆబండాలు వేయడం దారుణమని అన్నారు. లేనిపోని అబద్ధాలు చెబుతూ ప్రతిపక్షాలు కాలం గడుపుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రం వస్తే తీగలపై బట్టలు ఆరేసుకుంటారని నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల పాటు కరెంటు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్(BRS), సీఎం కేసీఆర్(CM KCR)దేనని అన్నారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. గత పాలనను ప్రస్తుత బీఆర్ఎస్ పాలనను బేరిజు వేసుకోని ప్రజలకు కార్యకర్తలు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి సార య్య, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ గౌడ్, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.