హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్ హిమాయత్నగర్లో దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. దీనికి కే ఏసురత్నం అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా కూనంనేని మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేని సామాజికంగా వెనుకబడిన తరగతులకు ఉపశమనం కలిగించేందుకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు అని పేర్కొన్నా రు. సమావేశంలో బాలనరసింహ, నర్రా శ్రవణ్, మారుపాక అనిల్కుమార్ పాల్గొన్నారు.