మహబూబ్ నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోలికి వస్తే దళిత సంఘాలు ఉరుకోవని మంత్రి పై జరిగిన హత్య కుట్రను ఖండిస్తున్నామని జిల్లా దళిత సంఘాల నేతలు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
మంత్రి ఎదుగుదలను చూసి తట్టుకోలేకనే హత్యకు కుట్రపన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలకు చోటులేదన్నారు. మంత్రిపై జరిగిన కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాడం ఆంజనేయులు, వినోద్ కుమార్, జంబులయ్య, హనుమంతు, జాజిమొగ్గ నర్సిములు, శ్రీనివాసులు, శరత్ చంద్ర, పత్తి వెంకట్రాములు ,డబ్బా రాములు, చిన్న, రమేష్, కాలే రమేష్, ప్రదీప్ కమార్, యాదయ్య, రాజ, తదితరులు పాల్గొన్నారు.