వరంగల్ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 64వ డివిజన్ టేకులగూడెం గ్రామానికి చెందిన గడ్డం సామెల్ అనే వ్యక్తి ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందాడు. టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే స్వయంగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు , సీఎం కేసీఆర్కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ముగ్గురు లబ్దిదారులకు రూ.2 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధిక రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ పోలపల్లి రామ్మూర్తి, స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.