వేల్పూర్, ఆగస్టు 27: ‘బీఆర్ఎస్ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పొందుతున్నాం. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే మా ఇంట్లో వారికి పింఛన్లు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, రైతు రుణమాఫీ, కేసీఆర్ కిట్ వచ్చా యి. ఇన్ని చేసిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. ఇవన్నీ మాకు ఇప్పించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికే మా ఓటు’ అంటూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో పలువురు తమ ఇంటి గోడలపై పెయింటింగ్తో రాయించుకున్నారు.
వీటితోపాటు తమ ఇంట్లో అనారోగ్యం, కరోనా వచ్చినప్పుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేశారు. తమను అన్ని విధాలుగా ఆదుకుంటున్న మంత్రి వేముల మళ్లీ గెలవాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్థానిక ప్రజలు గోడలపై రాసుకుని ప్రచారం చేస్తున్నారు.