బాన్సువాడ, సెప్టెంబర్ 1 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రకటించిన నాటి నుంచి ఆయా గ్రామాల వారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా బాన్సువాడ మండలంలోని కోనాపూర్, జేకే తండావాసులు తామంతా స్పీకర్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. శుక్రవారం వారు బాన్సువాడలోని స్పీకర్ పోచారం నివాసానికి వెళ్లి తీర్మాన ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా జేకే తండావాసులు మాట్లాడుతూ..
తమ తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతోపాటు అవరమైన అన్ని రకాల పనుల కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన పోచారం రుణం తీర్చుకోలేనిదని కోనాపూర్ వాసులు పేర్కొన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , సీఎం కేసీఆర్కు రెండు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం వేరే పార్టీల అభ్యర్థులు తమ గ్రామానికి రావొద్దని వారు సూచించారు.