మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గంట్లకుంట గ్రామంలో మాజీ సర్పంచ్ చింతల భాస్కర్రావు తన పంటను కాపాడుకొనేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేశాడు. బోరు బావిపై ఆధార పడి సాగు చేశాడు. పొలానికి నీరు సరిగా సరిపోక గురువారం జీపీ ట్యాంకర్ సహాయంతో నీటిని పట్టాడు.