హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమ యంలోనే తాము సెటి లర్ అనే పదం వాడ లేదని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొ న్నారు. నాటినుంచి నేటివరకు రాష్ట్రంలో ఉంటున్న సీమాంధ్రులతో సఖ్యతగా ఉంటున్నామని చెప్పారు. హైదరాబాద్లో సెటిలర్లు ఉన్నారని, వారిని దృష్టిలో పెట్టుకొనే ఏమీ అనటం లేదని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. అన్నదమ్ముల్లా ఉన్న ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించొద్దని హితవు పలికారు. ఆంధ్రా ప్రజల నీటికష్టాలు తీరాలని సీఎం కేసీఆర్ స్నేహహస్తం అందిస్తే ఏపీ నేతలు దానిని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీ జీవోల ప్రకారమే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. ఏపీ ప్రభుత్వమే నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నదని ధ్వజ మెత్తారు.
ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన ఉత్తర్వులు అక్రమమని ఏపీ సీఎం పేర్కొనటాన్ని శ్రీనివాస్గౌడ్ తప్పుబట్టారు. తెలంగాణను శాశ్వత ఎడారిగా మార్చేందుకే ఈ జీవోలు ఇచ్చా రా? అని ప్రశ్నించారు. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టేనని ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేస్తూనే.. సాగునీటి అవసరాలకు ప్రాజెక్టులు కడుతున్నామని పేర్కొనటం ద్వంద్వబుద్ధిని చూపుతున్నదని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్రబలగాలు దించాలని, ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సీఎం కోరడాన్ని తప్పుబట్టారు.