జనగామ రూ రల్, జనవరి 30: ‘పంటకందని జలం.. నెర్రెలిచ్చిన పొలం’ శీర్షికన ఈ నెల 27న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కాల్వ పనులు పూర్తి చేసి బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మంగళవారం నీటిని విడుదల చేశారు. దీంతో జనగామ జిల్లా ఎర్రకుంట తండా పరిధిలోని పొలాల్లో గోదావరి జలాలు పారాయి.
ఎండిపోతున్న పంటలకు ‘నమస్తే’ జీవం పోసిందని రైతులతోపాటు గ్రామస్థులు అభినందనలు తెలిపారు. పత్రికలో వచ్చిన కథనంతో తమకు నీరు విడుదల చేశారని పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారు.