పెద్దవూర, సెప్టెంబర్ 1: సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు ప్రభుత్వం దిగివచ్చింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని రైతుల సాగునీటి సమస్యను పరిషరించాలని, ఎస్ఎల్బీసీ లోలెవెల్ కెనాల్కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులు పెద్దవూరలోని హైదరాబాద్-సాగర్ హైవేపై ధర్నా చేపట్టారు.
భగత్ మాట్లాడుతూ.. సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వందలాది టీఎంసీల తరలిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం దిగివచ్చి వరద కాలువకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.