హైదరాబాద్, సెప్టెంబర్9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ను నీటితో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజులు మల్లన్నసాగర్కు నీటిని తరలించాలని నిర్ణయించారు.
రాజరాజేశ్వర జలాశయం నుంచి అన్నపూర్ణకు, అక్కడి నుంచి రంగనాయకసాగర్కు, అక్కడి నుంచి మల్లన్నసాగర్కు, అనంతరం కొండపోచమ్మకు గోదావరి జలాలను తరలిస్తారు.